లీడ్స్: ఇంగ్లండ్తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చిరస్మరణీయ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న యశస్వి శుక్రవారం మొదటి రోజు ఆటలో శతకం సాధించాడు. ఇక తన సెంచరీ గల కారణాలను యశస్వి మీడియాతో పంచుకున్నాడు. తొలి టెస్టులో మెరుగైన బ్యాటింగ్ చేశానంటే దానికి సహచర ఫాస్ట్ బౌలర్లు హర్షిత్ రాణా, జస్ప్రిత్ బుమ్రాలే కారణమని పేర్కొన్నాడు. తొలి టెస్టుకు ముందు టీమిండియా ఇంట్రాస్కాడ్ మ్యాచ్ ఆడింది.
ఈ మ్యాచ్లో యశస్వి అద్భుత బ్యాటింగ్ను కనబరిచాడు. ఈ మ్యాచ్లో బుమ్రా, హర్షిత్లు అద్భుత వేగంతో బౌలింగ్ చేశారు. వీరి బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొవడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. తొలి టెస్టులోమెరుగ్గాఆడేందుకు ఇది దోహదం చేసింది. బుమ్రా, సిరాజ్, హర్షిత్లలో అపార నైపుణ్యం దాగివుందని, అలాంటి బౌలర్ల బౌలింగ్లో ఆడడంతో తన బ్యాటింగ్ ఎంతో మెరుగుపడిందన్నాడు. ఇక, కెఎల్ రాహుల్తో కలిసి నెట్స్లో ఎక్కువ సేపు చెమటోడ్చానని, ఎలాంటి షాట్లు ఆడాలనే దానిపై ఇద్దరు పరస్పరం చర్చించుకుని దానిపై దృష్టి సారించామని యశస్వి వివరించాడు. రానున్న మ్యాచుల్లో మరింత మెరుగైన బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తానని జైస్వాల్ స్పష్టం చేశాడు.