- Advertisement -
అమరావతి: రోడ్డుప్రమాదాన్ని బలి అంటూ అడ్డగోలు రాతలు రాస్తున్నారని ఎపి మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై పచ్చమీడియా విషప్రచారం చేస్తుందని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎస్పి వ్యాఖ్యలను సైతం పచ్చ మీడియా వక్రీకరించిందని చెప్పారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సింగయ్య మృతిని (Singaiah death) వివాదం చేయాలనే కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం బలి ఎలా అవుతుందని ఎల్లో మీడియా చెప్పాలి? అని ప్రశ్నించారు. సింగయ్య మృతిపై తాము రాసిన నోట్ పై సంతకం చేయాలని పోలీసులు ఒత్తిడి చేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
- Advertisement -