మన తెలంగాణ/హైదరాబాద్: పన్నేతర రెవెన్యూ రాబడులను పెంచడంపై అధికారులు సీరియస్గా దృష్టి సారించాలని ఇన్ప్రాస్ట్రక్చర్ అం డ్ కేపిటల్ సబ్ కమిటీ ఛైర్మన్, ఉప ముఖ్యమం త్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదివా రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సబ్ కమిటీ మంత్రివర్గ ఉప సంఘం భేటీలో మంత్రులు, కమిటీ సభ్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఉ ప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. పన్నేతర రెవెన్యూతో పా టు కేంద్ర నిధులను కూడా సాధించుకోవాలని చెప్పారు. గత ప్రభుత్వ పథకాలను ఒక్కటి కూ డా ఆపకుండా కొత్తగా 33,600 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన 202324 ఆర్థిక సంవత్సరంలో మన ప్రభుత్వానికి ఔటర్ రింగ్ రోడ్, ఎక్సైజ్ ఆదాయాలు రాకుండా పోయాయని ఆయన చెప్పారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక, మహాలక్ష్మి, ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ సహా పలు కొత్త పథకాలను ప్రజలకు ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
బడ్జెట్ నిధులు కొన్ని శాఖలు అధికంగా, మరికొన్ని శాఖలకు అతి తక్కువగా అందుతున్నాయి. బడ్జెట్ ను అన్ని శాఖలకు సమానంగా పంచాలని, శాఖల మధ్య ఖర్చు అంతరాలను తగ్గించి అన్నింటిని ఒకే స్థాయిలోకి తీసుకురావాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో పెండింగ్ లో ఉన్న మేజర్ ప్రాజెక్టులను ప్రాముఖ్యతలను అనుసరించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రం అవసరాలు, ప్రాముఖ్యతల మేరకు బడ్జెట్ నిధులను ఖర్చు చేయాలని, ఖర్చులను కూడా రేషన్లైజ్ చేసుకుని ప్రియారిటీ అధారంగా ముందుకు వెళ్లాలని సూచించారు. రెవెన్యూ తీసుకువచ్చే శాఖలపై సీరియస్గా దృష్టి సారించాలని కోరారు. అవసరాల మేరకు నిధులు ఖర్చు చేయాలని, స్టేట్ రియలిస్టిక్ గా, లాజికల్గా ఖర్చులు చేయాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.