Monday, June 23, 2025

నేడు కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

మధ్యాహ్నం 3గంటలకు సిఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన
మంత్రివర్గ సమావేశం పంచాయతీ ఎన్నికలపై కీలక
నిర్ణయం తీసుకునే అవకాశం చర్చకు రానున్న బనకచర్ల
ప్రాజెక్టు, రాజీవ్ యువవికాసం

మన తెలంగాణ/హైదరాబాద్: రా ష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సోమవారం జరిగే మంత్రివ ర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీ సుకునే అవకాశం ఉంది. గ్రామ పం చాయతీ ఎన్నికలు, జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో వేటికి ముందుగా నిర్ణయించాలనే అంశంపై స్పష్టత రా నున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలంయలో మంత్రివర్గ సమావే శం జరుగనున్నది. ఈ సమావేశం లో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. స్థాని క సంస్థల ఎన్నికలు, బనకచర్ల ప్రా జెక్ట్, రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ స మావేశంలో జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ స్థాయిలో జరి గే ఎన్నికల షెడ్యూల్‌పై ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉంది. తద్వా రా స్థానిక సంస్థల పాలనను మరిం త బలోపేతం చేయాలనే ప్రభుత్వ యోచిస్తున్నట్లు తెలిసింది. మంత్రివ ర్గ సమావేశం నిర్ణయాల ద్వారా ప్ర జల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

బనకచర్ల ప్రాజెక్టుపై
చర్చించనున్న కేబినెట్
బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించే అంశంపై కేబినెట్ భేటీ చర్చించనున్నట్లు తెలిసిం ది. ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో  స్పష్టత ఇచ్చారు. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై ఎపి సిఎం చంద్రబాబుతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. తాము ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదని, అయితే తెలంగాణ హక్కులను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. వివాదాలకు కాదు, పరిష్కారాలకు తాము సిద్ధం అని సిఎం పేర్కొన్న నేపథ్యంలో సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి.. ఆ తర్వాత ఎపి సిఎం చంద్రబాబును చర్చలకు ఆహ్వానించనున్నట్లు తెలిసింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ నిర్ణయం మేరకే జరిగిందని ఇటీవల కాళేశ్వరం కమిషన్ ముందు అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు మంత్రులు ఈటల రాజేందర్, హరీష్‌రావు విచారణ సందర్భంలో చెప్పిన నేపథ్యంలో కేబినెట్ తీర్మానాలు తమకు అందజేయాలని కోరుతూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నెల 30వ తేదీలోగా కమిషన్ అప్పటి కేబినెట్ తీర్మానాలు పంపిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్‌కు అప్పటి కేబినెట్ తీర్మానాలు అందేసే అంశంపై మంత్రివర్గం సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News