- అబ్దుల్లాపూర్ మెట్టు లో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి అనాజ్ పూర్ చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. మైనర్ బాలిక ప్రణీత(12) ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడింది. ఈ ఘటనలో బాలికను కాపాడబోయి ఇంద్రసేన రెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. కూతురిని కాపాడబోయి నీటిలో మునిగిన తండ్రిని స్థానికులు కాపాడారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -