లీడ్స్: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇంగ్లండ్తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మూడోరోజు ఆటలో బంతిని మార్చాలని రిషభ్ పంత్ చేసిన విన్నపాన్ని అంపైర్ తిరస్కరించాడు. దాంతో సహనం కోల్పోయిన పంత్.. బంతిని నేలకుకొట్టాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 61వ ఓవర్ అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. ఓవర్ ముగియగానే బంతిని అంపైర్ వద్దకు తీసుకెళ్లిన పంత్.. ఆకారం దెబ్బతిన్నదని ఫిర్యాదు చేశాడు. దాంతో అంపైర్ తన వద్ద ఉన్న పరికరంతో బంతి ఆకారాన్ని పరీక్షించాడు.
బాగానే ఉందని, బంతిని మార్చాల్సిన అవసరం లేదని చెప్పాడు. దాంతో అసహనానికిగురైన పంత్.. అంపైర్పై కోపంతో బంతిని నేలకు కొట్టాడు. పంత్ రియాక్షన్కు అంపైర్ అవాక్కయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా బంతిని మార్చాలని అంపైర్ను కోరగా.. మరోసారి పరీక్షించిన అంపైర్ అవసరం లేదని చెప్పాడు. అంపైర్ పట్ల అనుచితంగా ప్రర్తించిన పంత్పై మ్యాచ్ రిఫరీ చర్యలకు దిగే అవకాశం ఉంది. కాగా, దీనిని సంబధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.