Monday, June 23, 2025

దళితులపై అమానుషం… అరగుండు కొట్టించి, మురుగు నీరు తాగించి… మోకాళ్లపై నడిపించి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: అంగట్లో ఆవు, దూడలను ఇద్దరు దళితులు కొనుగోలు చేసుకొని సొంతూరు వెళ్తుండగా గోవులను అక్రమ రవాణా చేస్తున్నారనే నెపంతో వారికి అరగుండు గీయించి, మురుగు నీరు తాగించి మోకాళ్లపై నడిపించారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో ధారాకోట ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హరిపూర్‌లో అంగట్లో ఇద్దరు దళితులు ఆవు, రెండు దూడలను కొనుగోలు చేశారు. వాటిని సొంతూరుకు తీసుకెళ్తుండగా ఖారిగుమ్మ వద్ద ఎనిమిది మంది వారిని ఆపారు. గోవులను ఆక్రమంగా రవాణా చేస్తున్నారనే నెపంతో వారి వద్ద నుంచి డబ్బులను లాక్కున్నారు.

దళితులు ప్రతిఘటించడంతో వారిపై నిందితులు దాడి చేశారు. అనంతరం దళితులకు అరగుండు కొట్టి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న జహాడ గ్రామం వరకు ఊరేగించడంతో  పాటు మురికి కాలువలో నీళ్లు తాగించి, మోకాళ్లపై నడిపించారు. దళితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులపై తల, వీపుపై గాయాలు ఉండడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News