- Advertisement -
తిరుమల: ప్రఖ్యాత ఆటో మొబైల్ కంపెనీ, అశోక్ లేలాండ్ టిటిడికి ఒక 41 సీటర్ ఏసి బస్సును ఆదివారం నాడు విరాళంగా అందించింది. సుమారు రూ. 35 లక్షల విలువైన ఈ బస్సును అశోక్ లేలాండ్ ఎం హెచ్ సివి అధ్యక్షుడు సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు టిటిడికి అందజేశారు. సాధారణంగా ప్రతి ఏడాది అశోక్ లేలాండ్ కంపెనీ వారు టిటిడికి ఒక ఆటోమొబైల్ వాహనాన్ని విరాళంగా అందిస్తుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం, తిరుమల డిపో డిఐ వెంకటాద్రి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -