మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరోహీరోయిన్లుగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం ‘లోపలికి రా చెప్తా’. కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది. ‘లోపలికి రా చెప్తా’ చిత్రం జూలై 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా (Grand worldwide) థియేటర్లలో విడుదల కాబోతోంది. హైదరాబాద్లో ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ట్రైలర్ లాంఛ్ జరిగింది.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూశాక మీలో భయం కలిగే ఉంటుంది. అయితే మనల్ని భయపెట్టే విషయాలు ఈ సినిమాలోలాగే బయట కూడా చాలా జరుగుతున్నాయి. లోపలికి రా చెప్తా సినిమా ప్రేక్షకుల్ని భయపెట్టడమే కాదు, వారి దగ్గర నుంచి మంచి కలెక్షన్స్ కూడా రాబట్టాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. హీరో, డైరెక్టర్ కొండా వెంకట రాజేంద్ర మాట్లాడుతూ.. ‘స్క్రీన్ ప్లేలో నాకు ఉన్న పదేళ్ల అనుభవంతో ‘లోపలికి రా చెప్తా’ చిత్రాన్ని రూపొందించాను. నాలుగైదు జానర్స్ కలిపి ఈ మూవీకి స్క్రిప్ట్ చేశాను. మా ప్రొడ్యూసర్ గణేష్ లేకుంటే ఈ మూవీ లేదు. హారర్, కామెడీతో పాటు యూత్కు కావాల్సిన రొమాంటిక్ ఎలిమెంట్స్ఈ సినిమాలో ఉంటాయి’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శుభలేఖ సుధాకర్, ప్రవీణ్ కటారి తదితరులు పాల్గొన్నారు.