నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) తాజాగా కష్టాల్లో పడింది. ఆమె నటించిన మలయాళ చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. ఈ సినిమాలో కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జూన్ 27న విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా విడుదలకు తాజాగా సెన్సార్ బోర్డు అడ్డుకట్ట వేసింది. ఈ సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. జానకి అనే మహిళ కోర్టులో చేసే న్యాయపోరాటం గురించి ఈ సినిమాను తెరకెక్కించారు. జానకి పాత్రలో అనుపమ (Anupama Parameshwaran) నటిస్తుంది. ప్రవీణ్ నారాయణ్ ఈ సినిమాకు దర్శకుడు.
అయితే సీతా దేవికి మరో పేరే జానకి. దీంతో దాడికి గురైన మహిళకు ఆ పేరు పెట్టడాన్ని సెన్సార్ బోర్డు తప్పుబట్టింది. వెంటనే టైటిల్, పాత్ర పేరును మార్చాలని చిత్ర యూనిట్కి సూచించింది. లేదంటే స్క్రీనింగ్కు అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పేసింది. ఇక ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్ని కృష్ణన్ ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. జానకి అనే పేరును ఉపయోగించరాదని సెన్సార్ బోర్డు చిత్ర యూనిట్కి స్ఫష్టంగా తెలియజేసినట్లు చెప్పారు. మరో నిర్మాత కూడా తన సినిమా విషయంలో ఇలాంటి సమస్యే ఎదురుకున్నానని.. అప్పుడు జానకి అనే పేరును ‘జయంతి’ అనే మార్చామని తెలిపారు. మరి ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్ర యూనిట్ ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.