టెహ్రాన్: ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై ఇజ్రాయిల్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయిల్కు మద్దతుగా అమెరికా కూడా రణరంగంలోకి దిగింది. టెహ్రాన్పై అమెరికా వైమానిక దాడులు చేసిన విషయం తెలిసింది. ఈ యుద్ధం మూడు దేశాల మధ్యగా అన్నట్టుగా నిలిచిపోయింది. మిత్రదేశమైన రష్యా ఇరాన్కు సహాయం చేయకపోవడంపై ఆశ్చర్యం కలుగుతోంది. ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిల్ పుతిన్ స్పందించారు. ఇజ్రాయిల్ దేశంలో 20 లక్షల మంది పౌరులు రష్యా ఫెడరేషన్ చెందిన వారు ఉన్నారని తెలిపారు. తమ దృష్టిలో ఇప్పుడు ఇజ్రాయిల్ రష్యన్ మాట్లాడే దేశమేనని పేర్కొన్నారు.
అందుకే ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుధ్దంలో తాము తటస్థంగా ఉన్నామని వివరించారు. రష్యా నిజాయితీపై మిత్ర దేశాలు మండిపడుతుండడతో వారంతా రెచ్చగొడుతున్నారని పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబ్ దేశాలతో తాము సుదీర్ఘకాలంగా అనుబంధం ఉందని వివరించారు. ఇరాన్కు అణ్వాయుధాలు అందించేకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్వభావం, ప్రభావం గల హోర్ముజ్ జలసంధి మూసివేతకు అత్యవసర ఇరాన్ పార్లమెంట్ సమావేశంలో ఆమోదించారు. దిగుమతి ఎగుమతులకు పశ్చిమ ఆసియా దేశాలకు రవాణాపరంగా ఇబ్బంది కలుగుతోంది. భారత్ లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.