Tuesday, June 24, 2025

ఎంపి రఘునందన్‌‌రావును చంపేస్తామంటూ బెదిరింపు కాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి ఎంపి రఘునందన్‌రావుకు (Raghunandan Rao) బెదిరింపు కాల్ వచ్చింది. ఆయన్ను సాయంత్రంలోగా చంపేస్తామంటూ పీపుల్ వార్ మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి బెదిరించారు. ఈ ఫోన్‌ కాల్‌ను రఘునందన్‌రావు పిఎ ఎత్తాడు. తాను మధ్యప్రదేశ్‌కి చెందిన మావోయిస్టునని ఆగంతకుడు చెప్పాడు. దమ్ముంటే కాపాడుకోండని రఘునందన్‌ను అతడు బెదిరించాడు.

మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపి రఘునందన్‌ (Raghunandan Rao) పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఆయనకు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే రఘునందన్‌ రావు అప్రమత్తమై తెలంగాణ డిజిపి జితేందర్‌, సంగారెడ్డి ఎస్పి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ 912143352974 అనే నెంబర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఎంపి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్ వచ్చిన నెంబర్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News