ఉన్నతాధికారులనూ తప్పుదోవ పట్టించిన ప్రభాకర్రావు అప్పటి జిఎడి,
న్యాయశాఖ కార్యదర్శుల వాంగ్మూలాలు నమోదు విదేశాల నుంచి
వచ్చాక మాజీ సిఎస్ శాంతికుమారి స్టేట్మెంట్ రికార్డు చేయనున్న సిట్
నేడు దర్యాప్తు బృందం ముందుకు ఎంపి ఈటల రాజేందర్
మన తెలంగాణ/హైదరాబాద్ :ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితుల విచారణ ఒక వైపు, మరోవైపు బాధితులతో పాటు అనుమతించిన అధికారుల వాం గ్మూలాల సమోదుతో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేస్తున్నారు.ఈ కేసులో అప్పటి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రఘునందన్ రా వు, న్యాయశాఖ కార్యదర్శి స్టేట్మెంట్ను సిట్ రి కార్డు చేసింది. మాజీ సిఎస్ శాంతి కుమారి విదేశాల నుంచి వచ్చిన తరువాత ఆమె వాంగూలా న్ని నమోదు చేయనుండగా, సోమవారం సిట్ అ ధికారులు రఘునందన్రావు వాంగ్మూలాన్ని రి కార్డు చేసారు. తమను ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్రా వు తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు చేసారు. జి ఎడి కార్యదర్శి రఘునందన్రావు చెప్పిన విషయాన్నే న్యాయశాఖ కార్యదర్శి నిర్ధారించారు.
దీంతో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉ న్న శాంతికుమారి వాదన కూడా ఇందుకు అనుగుణంగానే ఉండే అవకాశం ఉందని అంచనా వే స్తున్నారు.ఇదే కేసులో ఇప్పటికే అప్పటి హోం శాఖ కార్యదర్శి (ప్రస్తుత డిజిపి) జితేందర్, అ ప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ కూ డా త మను తప్పుదోవ పట్టించడం వల్లనే ఫోన్ ట్యా పింగ్కు అనుమతించినట్టు చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 18 85, సెక్షన్5(2) ప్రకారం ఏదైనా ఒక వ్యక్తి ఫో న్ ట్యాప్ చేయాలనుకుంటే పోలీసులు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డిజిపి నుంచి ముం దస్తు అనుమతి తీసుకోవాలి. అనంతరం ట్యాపిం గ్ చేయాల్సిన నెంబర్ల జాబితాను వారు రివ్యూ కమిటీకి పంపుతారు. ఈ రివ్యూ కమిటీ కేంద్ర టెలికాం శాఖ నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే సదరు ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జిఎడి, లా సెక్రటరీ ఇచ్చిన వాంగ్మూలంలో ప్రభాకర్ రావు తమను తప్పుదోవ పట్టించాడని పేర్కొనట్లు తెలిసింది. ఈ క్రమంలో సోమవారం సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరుకావడం ఇది ఆరవసారి.
2018 నుంచే ఫోన్ ట్యాపింగ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2018 ఎన్నికల వేళ నుంచే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ 2018 ఎన్నికల సమయం నుంచే జరిగినట్టు సిట్కు ఆధారాలు లభించినట్టు సమాచారం. ప్రణీత్ రావు నుంచి టాస్క్ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ సమాచారం వెళ్లినట్లు సిట్ విచారణలో తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ తోనే 2018 ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి టిడిపి తరపున పోటీ చేసిన భవ్య ఆనంద్ ప్రసాద్ డబ్బులు సీజ్ చేసినట్లు సమాచారం. ప్యారడైజ్ వద్ద ఆనంద్ ప్రసాద్కు చెందిన నగదును రాధాకిష్ రావు ఆదేశాలతో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేసి రూ.70లక్షలను సీజ్ చేసినట్లు సిట్ గుర్తించింది. అలాగే మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ గుర్తించింది.
ప్రస్తుత మెదక్ ఎంపి రఘునందన్రావు బందువులకు చెందిన కోటి రూపాయలను హైదరాబాద్ బేగంపేట పరిధిలోని రాధాకిషన్ రావు బృందం, టాస్క్ఫోర్స్ సీజ్ చేసింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఐజి ప్రభాకర్ రావు ఆదేశాలతో టాస్క్ఫోర్స్ టీమ్ శ్రీనాథ్ రెడ్డి ద్వారా గాంధీనగర్ పిఎస్ పరిధిలో రెక్కి నిర్వహించి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి రూ.3.50 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు సిట్ గుర్తించింది.. కాగా సోమవారం ఈ కేసులో తమ వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు పలువురు రాజకీయ నాయకులు సిట్ కార్యాలయానికి వచ్చారు. మేడ్చల్ కాంగ్రెస్ నేత హరివర్ధన్ రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.
నేడు సిట్ ఎదుటకు ఈటల
ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం సిట్ ఎదుటకు బిజెపి ఎంపి ఈటెల రాజేందర్తో పాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారని సిట్ వర్గాల సమాచారం.