మన తెలంగాణ/హైదరాబాద్ : మేడిగడ్డకు చిన్న మరమ్మత్తులు చేసి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశమున్నా బిఆర్ఎస్ను బద్నామ్ చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సుంకిశాల విషయంలో మాత్రం తమ లోపాలు ఎక్కడ బయట పడతాయోనని గుట్టు చప్పుడు కాకుండా రిపేర్లు మొద లు పెట్టిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు ఆరోపించారు. మేడిగడ్డకు ఒక నీతి, సుంకిశాలకు ఇంకో నీతా..? అంటూ ఎక్స్ వేదిక గా ప్రశ్నించారు.
సుంకిశాల మీద ఎ క్స్పర్ట్ కమి టీ ఎంక్వయిరీ ఉండదు, విజిలెన్స్ క మిషన్ విచారణ ఉండదు, జ్యుడీషియల్ కమిషన్ ఉం డదు, ఎన్డిఎస్ఎ రిపోర్ట్ ఉండదు… ఇవేమీ లేకుండానే సైలెంట్గా రిపేర్ చేయిస్తారని, కానీ అదే మేడిగడ్డలో రెండు పియర్స్ కుంగితే, అన్నీ ఉంటాయని విమర్శించారు. ఎన్డిఎస్ఎ, ఎక్స్పర్ట్ కమిటీ, రి టైర్డ్ ఇంజనీర్స్, ఇంకా వివిధ సం స్థలు ఆ పి యర్స్ రిపేర్ చేయమని ప్రభుత్వాన్ని అభ్యర్థించి నా, కన్స్ట్రక్షన్ కంపెనీ రిపేర్ చేయడానికి సిద్ధం అని చెప్పినా కూడా కేవలం రాజకీయ స్వార్థంతో రాష్ట్ర ప్రయోజనాలు కూడా పక్కకు పెట్ట డం, కాంగ్రెస్ మార్కు ప్రజా వ్యతిరేక- ప్రతిపక్ష వేధిం పు పాలనకు నిదర్శనమ హరీష్ పేర్కొన్నారు.