Tuesday, June 24, 2025

కీలక సన్నివేశాల చిత్రీకరణలో..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ రాబోతుంది. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. కాగా ఇటీవలే ముస్సోరీలో రెండవ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడవ షెడ్యూల్ ను సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో చిరు,- నయనతారలపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తారట. ఈ చిత్రంలో కేథరీన్, మాస్టర్ రేవంత్, ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని (entertaining film).. ఈ మూవీ కథ తనకు నచ్చిందని చెప్పారు. అన్నట్టు, అనిల్ రావిపూడి చెప్పిన సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. “సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుకున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది”అని అన్నారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News