Tuesday, June 24, 2025

మంచి కథలు, వినూత్న కంటెంట్ అందిస్తాం

- Advertisement -
- Advertisement -

‘కొమరం భీమ్’ వంటి అవార్డు విన్నింగ్ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రముఖ రచయిత,- దర్శకుడు అల్లాణి శ్రీధర్ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవానికి జ్యూరీ చైర్మన్‌గా, నంది అవార్డు కమిటీలకు సభ్యుడిగా, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డుల విధివిధానాల కమిటీలో సభ్యుడిగా విశిష్ట సేవలందించారు. ‘రగులుతున్న భారతం’ చిత్రానికి అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు వంటి దిగ్గజాలతో ఆయన కలిసి పనిచేశారు. సరోజినీ నాయుడు జాతీయ సమగ్రతా అవార్డు పొందిన చిత్ర నిర్మాత ఆయన. అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన ‘తథాగత బుద్ధ’ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో ఘన విజయం సాధించి యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్ సాధించింది. రాష్ట్ర ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ రైటర్ అవార్డులు పొందిన అల్లాణి శ్రీధర్ మంగళవారం తన జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు.

ఈ సందర్భంగా అల్లాణి మీడియాతో మాట్లాడుతూ “ప్రస్తుతం ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న నేను ఇటీవల ‘ఫిల్మీడియా డిజిటల్ కంటెంట్’ (Filmedia Digital Content’) అనే కొత్త యూనిట్‌ను ప్రారంభించాను. అవసరమైనవారికి డిజిటల్ కంటెంట్‌ను రూపొందించి అందించడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇక వర్చువల్ వన్ అనే ప్రముఖ సంస్థతో కలిసి ఒక భారీ సోషియో ఫాంటసీ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టాము. మరో కొత్త చిత్రాన్ని తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మాతగా, సి.కల్యాణ్ సమర్పణలో రూపొందిస్తున్నాము. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది ఈ సిని మా. ఈ సంవత్సరం కొత్త కొత్త ప్రాజెక్టులతో ముందుకు వెళ్తున్నాను. ప్రేక్షకులకు మంచి కథలు, వినూత్న కంటెంట్ అందించాలని లక్షంగా పెట్టుకున్నాము”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News