మేడ్చల్ మల్కాజ్ గిరి: అరుదుగా వచ్చే కేసులలో ఇదొకటిగా నిలిచింది పాలు పగిలాయని ఫిర్యాదు చేయగా కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న జరిగిన సంఘటన, కుకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో హెరిటేజ్ పాలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చి కాచిన మొదటి ప్యాకెట్ బాగానే ఉంది. మరో ప్యాకెట్ ఉదయం కాచేసరికి పగిలిపోయాయి అసలు ఏంటి అని ప్రశ్నించగా వాళ్లకి మేము ఏమి చేస్తాం అంటూ దుకాణదారుడు జవాబుకు దీటుగా స్థానిక పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా కేవలం ఒక సంస్థ నుండి వచ్చే పాలే కాకుండా ఈ మధ్యకాలంలో పలు సంస్థల పాలు పగులుతున్నాయి. వాసన వస్తున్నాయని వినికిడి కూడా ఎక్కువగా ఉంది, వీటిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని ఎంతో మంది కస్టమర్లు కోరుతున్నారు.
కూకట్ పల్లిలో పాకెట్ పాలు పగిలినాయని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -