129 మంది గ్రేడ్ 1 గ్రేడ్ 2, గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్లను
ట్రాన్స్ఫర్ చేస్తూ ఎంఏయూడి సెక్రటరీ టికె శ్రీదేవి ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఆ శాఖ ఎంఏయూడి సెక్రటరీ టికె శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 129 మంది గ్రేడ్ 1 గ్రేడ్ 2, గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్లకు పదోన్నతులు కల్పించడంతో పాటు వారికి వివిధ జిల్లాలో పోస్టింగ్లను కల్పించారు. దీనికి సంబంధించి ఐదు జిఓలను ఎంఏయూడి సెక్రటరీ టికె శ్రీదేవి జారీ చేశారు. జిఓ 302లో 11 మంది గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లను, జిఓ 301లో 12 మంది గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్లను, జిఓ 300 కింద గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్లను 39 మందిని, 298 జిఓ కింద 11 మంది మున్సిపల్ కమిషనర్లను, 299 జిఓ కింద గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్లను 56 మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. దీనికి సంబంధించిన ఆ శాఖ ఎంఏయూడి సెక్రటరీ టికె శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -