Wednesday, June 25, 2025

ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం.. భారత్ కు 17 మంది తెలంగాణ వాసులు

- Advertisement -
- Advertisement -

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో తెలంగాణ పౌరులకు పూర్తి సాయం
ఇప్పటివరకు 23 మందికి ప్రభుత్వం నుంచి సాయం
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే తెలంగాణ వాసులకు పూర్తి సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు 23 మంది తెలంగాణ వాసులు ఇండియా రావడానికి తెలంగాణ ప్రభుత్వం కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించింది. మంగళవారం 17 మంది న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. వీరిలో ఆరుగురు ఇరాన్ నుంచి, 11 మంది ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి సురక్షితంగా వచ్చారు. న్యూఢిల్లీకి చేరుకుంటున్న వారి కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఇజ్రాయిల్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల ఇబ్బందులు తలెత్తినప్పటికీ, ఈ సవాళ్లను అధిగమించి, తెలంగాణ పౌరులకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. విదేశాంగ మంత్రిత్వశాఖ, భారత రాయబార కార్యాలయాలు, సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సమన్వయంతో పనిచేస్తోంది. స్వదేశానికి వచ్చే ప్రతి తెలంగాణ నివాసికి సకాలంలో సాయం, సరైన వసతి, తదుపరి ప్రయాణ సౌకర్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News