ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ జట్టుతో జరుగిన తొలి టెస్టులో టీమిండియా చెత్త రికార్డు తన పేరిట లిఖించుకుంది. రెండు ఇన్నింగ్స్ ల్లో భారత బ్యాట్స్ మెన్స్ యశస్వి జైస్వాల్(101), కెప్టెన్ శుభ్ మన్ గిల్(147), కెఎల్ రాహుల్(137), రిషబ్ పంత్(134, 118)లు సూపర్ శతకాలతో చెలరేగినా.. మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చింది. దీంతో భారత్ టెస్టుల్లో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒక టెస్టు మ్యాచ్ లో ఐదు సెంచరీలు సాధించినా.. ప్రత్యర్థి చేతిలో ఓడిపోయిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు ఆస్ట్రేలియా జట్టు పేరిట ఉన్నది. యాషెస్ సిరీస్ లో నలుగురు ఆసీస్ బ్యాట్స్ మెన్లు సెంచరీలు చేసినా ఆ జట్టు ఓటమిపాలైంది.
ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జైస్వాల్, గిల్, పంత్ లు శతకాలతో రాణించారు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు 465కు పరిమితమైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో పంత్, కెఎల్ రాహుల్ లు సెంచరీలతో చెలరేగడంతో భారత్ 364 పరుగులు చేసింది. అనంతరం 371 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ 82 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని దక్కించుకుది.