స్టార్ డైరక్టర్ రాజమౌళి (SS Rajamouli) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న జక్కన్న.. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ సెలబ్రిటీ అయిపోయారు. ఈ చిత్రాల్లో నటించిన ప్రభాస్(బాహుబలి), ఎన్టిఆర్, రామ్చరణ్(ఆర్ఆర్ఆర్) లను పాన్ ఇండియా స్టార్స్ని చేశారు రాజమౌళి. ప్రస్తుతం ఆయన మహేశ్ బాబుతో సినిమా తీస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఓ అరుదైన్ ఫీట్ని సాధించారు. ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్లో విడుదల చేసిన క్రమంలో రాజమౌళి.. జపనీస్ వీడియో గేమ్ క్రియేటర్ హిడియో కోజిమానిని కలిశారు. అయితే మహేశ్తో సినిమా కోసం ఈయన కలిసి పని చేస్తారని అప్పట్లో చర్చ జరిగింది.
కానీ ఇప్పుడు అది అవాస్తవమని తేలింది. కోజిమా సృష్టించిన ‘డెత్ స్టాండింగ్ 2’లో రాజమౌళితో (SS Rajamouli) పాటు ఆయన కుమారుడు కార్తికేయా కనిపించారు. ఇంటర్నేషనల్ వీడియో గేమ్లో కలిపించిన పాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు రాజమౌళి. అంతేకాక వీడియో గేమ్లో కనిపించిన తొలి భారతీయ సెలబ్రిటీగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ వీడియో గేమ్లో రాజమౌళి కనిపించిన క్లిప్ ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక మహేశ్ బాబుతో రాజమౌళి గ్లోబ్ ట్రాటింగ్ జంగిల్ అడ్వెంచర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలో ఈ సినిమా కొంత షూటింగ్ జరిగింది. త్వరలో మరో షెడ్యూల్ షూటింగ్ కోసం టీమ్ కెన్యాకు వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం సినీ చరిత్రలోనే రూ.50 కోట్లు పెట్టి అత్యంత ఖరీదైన వారణాసి సెట్ని హైదరాబాద్లో నిర్మిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.