Thursday, June 26, 2025

తాలిబన్ల దాడుల్లో అభినందన్‌ను బంధించిన పాక్ మేజర్ మృతి

- Advertisement -
- Advertisement -

2019లో భారత పైలట్ అభినందన్ వర్థమాన్‌ను బంధించిన పాకిస్తానీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా మృతి చెందినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లో దక్షిణ వజీరిస్తాన్ జిల్లా, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో చేపట్టిన నిఘా ఆధారిత ఆపరేషన్ (IBO)లో భద్రతా దళాలు 11 మంది ఉగ్రవాదులను హతమార్చగా, ఇద్దరు భద్రతా సిబ్బంది అమరులయ్యారని పాక్ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(TTP) ఉగ్రవాదులతో జరిగిన ఈ ఘర్షణలో మరణించిన ఇద్దరు భద్రతా సిబ్బందిలో అబ్బాస్ షా కూడా ఉన్నట్లు సైన్యం వెల్లడించింది.

కాగా, పుల్వామా దాడి జరిగిన పన్నెండు రోజుల తర్వాత ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత్ దాడి చేసింది. తర్వాత పాకిస్తాన్, భారత్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ప్రణాళికతో వైమానిక దాడులు ప్రారంభించింది. పాక్ దాడులను అడ్డుకునేందుకు భారత్ కూడా యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. అప్పటి వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శ్రీనగర్‌లోని 51 స్క్వాడ్రన్‌లోని భారత పుష్‌బ్యాక్ బృందంలో భాగంగా ఉన్నారు. ఇరుదేశాల మధ్య వైమానిక దాడుల సమయంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు అభినందన్ విమానాన్ని కూల్చివేసాయి. ఈ క్రమంలో నియంత్రణ రేఖ (LOC) వద్ద పాక్ భూభాగంలో పడిపోయిన అభినందన్ వర్థమాన్ పాక్ బంధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలుమార్లు చర్చల అనంతరం అభినందన్ ను పాక్ విడిచి పెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News