- Advertisement -
హైదరాబాద్: నటి అభిజ్ఞ, చరణ్ లక్కరాజు నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ‘విరాటపాలెం’ (Viraatapalem). ‘పిసి మీనా రిపోర్టింగ్’ అనేది క్యాప్షన్. ‘రెక్కీ’ ఫేమ్ పోలూరు కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఈ నెల 27 నుంచి జీ5లో ప్రసారం కానుంది. అయితే అంతకు ముందే ఈ సిరీస్కి ఊహించని షాక్ తగిలింది. ఈ సిరీస్ ప్రసారాన్ని నిలిపివేయాలంటే.. మరో ఒటిటి యాప్ ఈటివి విన్ కోర్టును ఆశ్రయించింది. తన ప్లాట్ఫామ్లో ప్రసారం కానున్న ‘కానిస్టేబుల్ కనకం’ కథతోనే ‘విరాటపాలెం’ సిద్ధమైందని ఈటివి విన్ కోర్టుకు తెలిపింది. వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో ‘కానిస్టేబుల్ కనకం’ ఈటివి విన్ ఒరిజినల్ సిరీస్గా రూపొందుతోంది. మరి ఈ రెండు సిరీస్లలో ఏది ముందు విడుదలవుతుందో తెలియాలంటే.. కోర్టు తీర్పు వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.
- Advertisement -