Thursday, June 26, 2025

నారాయణపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్: ఇద్దరు మహిళా మావోలు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోలు దుర్మరణం చెందారు. మావోయిస్టుల మాడ్ డివిజన్ సీనియర్ కేడర్ అబూజ్‌మడ్ అడవుల్లో సంచరిస్తున్నారని సమాచారం రావడంతో డిఆర్‌జి, స్టేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టులు తారసపడగానే లొంగిపోమ్మని పోలీసులు కోరారు. మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామాగ్రి, ఇన్సాస్ రైఫిల్, ఆయుధాలను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. మిగిలిన మావోల కోసం గాలింపు చర్యలు చేపట్టామని భద్రతా బలగాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News