హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పులను మాజీ సిఎం కెసిఆర్ సకాలంలో చెల్లించారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డికి అవినీతి చక్ర బిరుదు ఇస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..18 నెలల్లోనే రూ. 2 లక్షల కోట్లు రేవంత్ అప్పులు తెచ్చారని, ఆర్ సి సంస్థకు 2024 నుంచి రేవంత్ ప్రభుత్వం కిస్తీలు (Government installments) కట్టడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో రేవంత్ విఫలం అయ్యారని ఎద్దేవా చేశారు. పోలవరంతో భద్రాచలంతో పాటు 5 గ్రామాలకు అన్యాయం జరుగుతున్నా, రేవంత్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 2024జూలై 6న ప్రగతి భవన్ లోఎపి సిఎం చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ తర్వాతనే..బనకచర్ల ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. గోదావరి- కావేరి లింక్ పేరుతో చంద్రబాబు నీళ్లు తరలిస్తుంటే, రేవంత్ ప్రభుత్వ మొద్దు నిద్రతో అన్యాయం జరుగుతోందని కవిత ధ్వజమెత్తారు.
బాబుతో రేవంత్ సమావేశం… బంకచర్ల పనులు ప్రారంభం: కవిత
- Advertisement -
- Advertisement -
- Advertisement -