లీడ్స్: ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా ఎడ్జ్బాస్టన్లో భారత్తో జరిగే రెండో టెస్ట్ కోసం వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ చాలా కాలం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆర్చర్ 2021లో అహ్మదాబాద్లో భారత్తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుండి పలుసార్లు గాయాల బారిన పడటంతో నాలుగు సంవత్సరాలుగా టెస్టులకు ఆర్చర్ దూరమయ్యాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. మధ్యలో ECB అతనిని పలు మ్యాచ్ లను ఆడించడంతో మళ్లీ గాయాల బారిన పడ్డాడు. దీంతో అతను పూర్తిగా కోలకున్నాకే ఆడించాలనే ఉద్దేశంతో నాలుగు సంవత్సరాలుగా టెస్టులకు దూరంగా ఉంచారు.
IPL 2025లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆర్చర్ ఆడాడు. కానీ బొటనవేలు గాయం కారణంగా, అతను సీజన్ చివరలో జట్టు నుండి తప్పుకున్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న ఆర్చర్ రెడ్-బాల్ క్రికెట్ లో పురోగతి సాధించడంతోపాటు ఎటువంటి ఫిర్యాదులు లేకపోవడంతో జట్టు యాజమాన్యం అతన్ని భారత్ తో జరిగే రెండవ టెస్ట్ కు తిరిగి తీసుకురావాలని నిర్ణయించింది. అర్చర్ తప్ప ఇంగ్లాండ్ జట్టులో మార్పులు లేవు. బ్రైడాన్ కార్సే స్థానంలో అర్చర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. తొలి టెస్టులో బెన్ స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు భారత్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. జూలై 2 నుండి ఇరుజట్ల మద్య రెండో ప్రారంభం కానుంది.
ఇంగ్లాండ్ జట్టు:
బెన్ స్టోక్స్ (డర్హామ్), జోఫ్రా ఆర్చర్ (ససెక్స్), షోయబ్ బషీర్ (సోమర్సెట్), జాకబ్ బెథెల్ (వార్విక్షైర్), హ్యారీ బ్రూక్ (యార్క్షైర్), బ్రైడాన్ కార్స్ (డర్హామ్), సామ్ కుక్ (ఎసెక్స్), జాక్ క్రాలీ (కెంట్), బెన్ డకెట్ (నాటింగ్హామ్షైర్), జామీ ఓవర్టన్ (సర్రే), ఓల్లీ పోప్ (సర్రే), జో రూట్ (యార్క్షైర్), జామీ స్మిత్ (సర్రే), జోష్ టంగ్ (నాటింగ్హామ్షైర్), క్రిస్ వోక్స్ (వార్విక్షైర్)