Thursday, July 31, 2025

బిజెపి మంత్రులు ఏం చేస్తున్నారు?

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌కు రూ.2లక్షల కోట్లతో
బుల్లెట్ ట్రయిన్ హైదరాబాద్‌కు
రెండోదశ మెట్రో ఇవ్వరా?
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కెటిఆర్ ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ రెండో దశ మెట్రో విస్తరణ ప్రాజెక్ట్ ప్రతిపాదనల ను కేంద్ర విస్మరించడంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్య క్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో తెంలగాణ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు..8 మంది బి జెపి ఎంపిలు ఉన్నారు..వారంతా ఏం చేస్తున్నా రు…ఎవరి కోసం పనిచేస్తున్నారని అడిగారు. గుజరాత్‌కు రూ.2 లక్షల కోట్లతో బుల్లెట్ ట్రైన్లు ఇస్తున్నారు, తెలంగాణకు కనీసం మెట్రో ప్రాజెక్టును ఇవ్వరా..? అని ప్రశ్నించారు.
సిఎం నిర్లక్షం… జూరాలకు శాపం
జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తె గిపోవడం కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతకాని ముఖ్యమంత్రికి కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే జూరాల ప్రాజెక్టు డేంజర్‌లో పడిందని ఆరోపించారు. ప్రతిఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో రేవంత్ సర్కారు నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.

జూరాలకు క్రమంగా వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలని అన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల ఎస్.ఎల్.బి.సి టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పెద్దవాగుకు గండిపడి 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, వట్టెం పంప్ హౌజ్ మునిగిపోయిందని, సుంకిశాల రిటేనింగి వాల్ కుప్పకూలి వందల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇప్పుడు జూరాల 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడంతోపాటు ఇతర గేట్ల రోప్‌లు బలహీనంగా ఉండటం ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టిందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు ఎగువ నుంచి పెరుగుతున్న ఇన్ ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పకడ్బందీగా వ్యవహరించాలని తెలిపారు. జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News