Friday, June 27, 2025

ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు

- Advertisement -
- Advertisement -

రూ.180.38కోట్ల మెడికల్ రీయంబర్స్‌మెంట్ బిల్లులకు
ఆమోదం 26,519మందికి ప్రయోజనం గత
ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులను సైతం క్లియర్
చేసిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చకచకా
పరిష్కారమవుతున్న ఉద్యోగుల సమస్యలు

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీ పి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగు లు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రియంబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లుల మొ త్తం 180.38 కోట్లు నిధులను డిప్యూటీ సీ ఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఒకేసారి విడుదల చేశారు. తొమ్మిది రో జుల వ్యవధిలోనే తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన ప్రజా ప్రభుత్వం, విపక్షాల అంచనాలను తలకిందులు చేస్తూ మరుసటి రోజే ఉద్యోగుల మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు 180.38 కోట్లు క్లియర్ చేయడం గమనా ర్హం. ఈనెల 13న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డిఏ లు పెం చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా మెడికల్ రీయంబర్స్‌మెం ట్ బిల్లులను క్లియర్ చేసింది. మరోవైపు ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలను
మంత్రుల సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 15 రోజుల వ్యవధిలోనే పరిష్కరించడం విశేషం.

తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, లెక్కకు మించిన సంక్షేమ పథకాలు మరోవైపు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్‌మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ డిప్యూటీ సీఎం వాటిని క్లియర్ చేశారు. గత ప్రభుత్వ కాలం లో 2023 మార్చి 4 నుంచి -2025 జూన్ 20 వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఒకేసారి క్లియర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు గత 27 నెలలుగా మెడికల్ రీయంబర్స్‌మెంట్ బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎంప్లాయిస్ వెల్ఫేర్ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వెళుతున్నారు.
ఉద్యోగులు, ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబంగా భావించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలను పెంచుతూ ఈనెల 13న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. డిఎ పెంపుతో రాష్ట్రం లోని 3.50 లక్షల మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ఒక డీఏకు ప్రతినెలా ప్రభుత్వ ఖజానాపై 2,400 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. ఆర్థిక భారం అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన ధ్యేయం భావించే ప్రజా ప్రభుత్వం డిఏ పెంపు ఉత్తర్వులను విడుదల చేసింది.

వీటితోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖలో, ప్రణాళికా శాఖలో క్యాడర్ స్ట్రెంత్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జనాభాను అనుసరించి గ్రామపంచాయతీలను నాలుగు గ్రేడ్ లుగా విభజిస్తున్నారు. వీటితో పాటు ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ పథకం పూర్తిస్థాయిలో సిద్ధమవుతుంది. వివిధ శాఖల్లో ప్రమోషన్లకు సంబంధించిన డిపిసి కమిటీలు వేగం పెంచాయి. రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని 7.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కావడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News