Friday, June 27, 2025

మూడు నెలల పరేషాన్

- Advertisement -
- Advertisement -

మూడు నెలల కోటాతో
మొరాయిస్తున్న సర్వర్లు
సర్వర్ల సమస్యను కేంద్రంపై
నెట్టుతున్న అధికారులు
గంటల తరబడి బారులు
తీరుతున్న కార్డుదారులు
ఒత్తిడి తట్టుకోలేక టోకెన్లు
ఇస్తున్న డీలర్లు ఈనెల 30తో
ముగియనున్న మూడునెలల
కోటా గడువు గడువు
పెంచాలని కోరుతున్న
రేషన్ డీలర్లు,లబ్ధిదారులు

మన తెలంగాణ / హైదరాబాద్ : సన్నబియ్యం పంపిణీపై సర్వర్ సమస్య రేషన్ కార్డుదారుల ను ఇబ్బందులకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభు త్వం మూడు నెలల కోటాను ఒకే సారి బియ్యం పంపిణీ చేయాలన్న నిర్ణయం డీలర్లకు శరాఘాతంగా మారింది. ప్రతి నెల ఒక్కసారి మాత్రమే వేలి ముద్రలు వేసి బియ్యం ఇతర సరుకులు తీ సుకునే పద్దతి కొనసాగుతుండగా, ప్రస్తుతం మూడు నెలల కోటాతో ఒక్కొ రేషన్ కార్డు దారు లు మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి రావడంతో సర్వర్ నిలిచిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఒకటో తేదీ నుంచి ఇదే పరిస్థితి తలెత్తడడంతో ఒత్తిడి తట్టుకోలేని డీలర్లు అనధికారికం గా రోజుకు కొన్ని టోకెన్లు కార్డుదారులకు ఇచ్చి రద్దీని తగ్గించుకునే విధంగా చర్యలు చేపట్టా రు. ఈనెల 30తో ముగియనున్న మూడునెలల కోటా గడువు ముగుస్తుండడంతో రేషన్ కార్డు హోల్డర్లు

తమ సరుకులను తీసుకునేందుకు వీ లుగా టోకెన్ల కోసం ఎగబడుతున్నారు. రాష్ట్రం లో రేషన్ కార్డు కలిగిఉన్న పేదలకు సన్న బి య్యం పంపిణీ అటు సర్కారుకు, ఇటు డీలర్లకు సంకటంగా మారింది. రేషన్ బియ్యం మూడు నెలల కోటా ఒకేసారి ఇచ్చే ప్రతిపాదనలపై తొ లుత ప్రజల నుంచి హర్షం వ్యక్తం అయినప్పటి కీ ఆ తర్వాత సమస్యలు వెంటాడుతున్నాయి. పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో సర్వర్లు మోరాయిస్తుండడంతో అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఒక్కొక్క రేషన్ షాపు డీలర్లు రోజువారీగా టోకెన్లు ఇచ్చే సాంప్రదాయానికి తెరతీశారు. రోజుకు కనీసం యాబై చొప్పున టోకెన్లను ఇస్తుండడంతో రేషన్ కార్డు హోల్డర్లు తెల్లవారుజాము నుంచే రేషన్ షాపుల వద్ద బారులు తీరి నిలుచుంటున్నారు.
నిత్యం సర్వర్ సమస్యలు
సర్వర్ సమస్యలు తమకు సంబంధం లేదనే రీతిలో పౌరసఫరాల శాఖ వ్యవహరిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వర్ కారణంగా తమ సమయం ఎంతో వృధా అవుతోందని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వర్ సామర్ధం పెంపుదల విషయంలో సివిల్ సప్లై ఎప్పటి కప్పుడు చేతులు దులుపుకుంటోందని ఆరోపిస్తున్నారు.

వన్ నేషన్.. వన్ రేషన్‌కు తప్పని ఇబ్బందులు
దేశవ్యాప్తంగా తెల్లరేషన్ కార్డుదారులు ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం “వన్ నేషన్.. వన్ రేషన్‌” అమలుచేయాలని భావించినప్పటికీ ఇబ్బందుకు తప్పడంలేదు. ఇతర రాష్ట్రాల్లోని రేషన్‌కార్డుదారులు తెలంగాణలో సరుకులు తీసుకోవాలంటే ఈ పోస్ యంత్రంలో ఐఎంపిడిఎస్ లో రేషన్ కార్డు నెంబర్లు అందుబాటులో ఉండడంలేదు. దీంతో ఇతర రాష్ట్రాల కార్డుదారులు రేషన్ షాపుల వద్దకు వచ్చి నిరాశగా వెనక్కి వెళ్లాల్సి వస్తోంది.
పదేండ్లుగా పోర్టింగ్ సమస్య
ఉమ్మడి రాష్ట్రంలో పోర్టింగ్ సమస్య పరిష్కారం చేయకపోవడంతో రాష్ట్ర విభజన తర్వాత గత పదేండ్లుగా ఇదే పరిస్థితి ఎదురవుతుందని పలువురు డీలర్లు వెల్లడించారు. తక్షణమే పౌరసఫరాల శాఖ అధికారులు ఇతర రాష్ట్రాల తెల్లరేషన్ కార్డుదారులు కూడా ఎక్కడైనా సరుకులు తీసుకునేలా పోర్టింగ్ సౌకర్యాన్ని చేయాలని కోరుతున్నారు.

పక్కదారి పడుతున్న సన్నబియ్యం
ఇప్పటి వరకు దొడ్డు బియ్యం వినియోగం తగ్గుముఖం పట్టి దారిమళ్ళిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఉగాది పండుగ నుంచి అమలులోకి వచ్చిన సన్నబియ్యం పంపిణీ కూడా దొడ్డిదారిన బహిరంగ మార్కెట్‌లోకి తరలిపోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డు హోల్డర్లు, రేషన్ డీలర్ల నుంచి సన్నబియ్యం కొనుగోలుచేసి పలు రకాల బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో వందల క్వింటాళ్ళ సన్నబియ్యం పక్కదారి పట్టినట్లుగా పౌరసరఫరాల అధికారులు గుర్తించారు. అయితే మూడు నెలల రేషన్ కోటా ఒకే సారి ఇవ్వడం ఇందుకు కారణమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News