భారతదేశపు ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ (వైఆర్ఎఫ్) స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆఫ్ ది ఇయర్ ‘వార్ 2’ను ఆగస్టు 14, 2025న ఐమ్యాక్స్ థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్, యుకె, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఆసియా సహా భారతదేశంలో ఐమ్యాక్స్ థియేటర్లలో విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు నెక్స్ లెవెల్లో ఓ అద్భుతమైన ఎక్స్పీరియెన్స్ను ఈ చిత్రం అందించనుంది. ఇక వైఆర్ఎఫ్ సంస్థ వార్ 2 రిలీజ్కు ఇంకా 50 రోజులు మాత్రమే ఉందని తెలియజేసే సరికొత్త పోస్టర్ను విడుదల చేసింది.
ఈ సందర్భంగా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీల పోస్టర్లను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ వైస్ ప్రెసిడెంట్ నెల్సన్ డిసౌజా ఈ సందర్భంగా మాట్లాడుతూ “యశ్ రాజ్ ఫిలింస్ ద్వారా భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. వార్ 2 అనేది వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో ఒక ముఖ్యమైన భాగం. ఇండియన్ సినిమాలో ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య జరిగే ఈ అద్భుతమైన పోరును ఐమ్యాక్స్ ఫార్మాట్లో ప్రదర్శించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించగలగుతాం”అని అన్నారు. అద్భుతమైన విజువల్స్, వావ్ అనిపించే యాక్షన్ సీక్వెన్స్లతో కూడిన వార్2 ను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు.