- Advertisement -
ముంబై: ఇంగ్లండ్తో జరిగే రెండో టెస్టుకు కొంత సమయం ఉన్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. సుదీర్ఘ కాలం పాటు జరిగే సిరీస్ కోసం ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి అవసరమన్నాడు. మొదటి టెస్టులో ఓటమితో ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు ఒత్తిడిలో ఉన్నారన్నాడు. అయితే ఈ ఓటమిని ఇంతటితో వదిలి వేయాలన్నాడు. కొంత విశ్రాంతి తీసుకుని రెండో టెస్టు కోసం ముమ్మర సాధన ప్రారంభించాలని గవాస్కర్ హితవు పలికాడు.
- Advertisement -