రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టు ఎంపిక
బర్మింగ్హామ్: భారత్తో జరిగే రెండో టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. జులై రెండు నుంచి బర్మింగ్హామ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. 2021 తర్వాత జోఫ్రా ఆర్చర్ ఇంగ్లండ్ టెస్టు టీమ్లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. వరుస గాయాలు ఎదురు కావడంతో ఆర్చర్ టెస్టు జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం అతను పూర్తి ఫిట్నెస్ సాఛించడంతో తిరిగి టెస్టు టీమ్లోకి స్థానం లభించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా భారత్తో సొంత గడ్డపై ఇంగ్లండ్ ఐదు మ్యాచ్లు ఆడనుంది.
ఇప్పటికే లీడ్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్ సిరీస్లో 10 ఆధిక్యంలో నిలిచింది. మిగిలిన మ్యాచుల్లో కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. కాగా, ఇరు జట్ల మధ్య జులై 2 నుంచి బర్మింగ్హామ్లో రెండో టెస్టు జరుగనుంది. దీని కోసం గురువారం ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు.
జట్టు వివరాలు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, జో రూట్, వోక్స్, జోష్ టంగ్. ఓలి పోప్.