హైదరాబాద్: బనకచర్లపై పిపిటి పేరుతో సిఎం రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. డైవర్షన్ కోసమే ప్రజాప్రతినిధులకు సిఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2016 ఎజెండా మినిట్స్ పై రేవంత్ తో చర్చకు సిద్ధం అని అన్నారు. తెలంగాణకు ఆమోదయోగ్యం (Acceptable) లేకుంటే ఒప్పుకునేది లేదని, బనకచర్ల పై జలశక్తి మీటింగ్ లో తెలంగాణ వాదన గట్టిగా విన్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేంద్రంలో తనకున్న పలుకుబడితో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ హయాంలో బనకచర్ల కార్పొరేషన్ లేదని, టెండర్లు పిలవలేదని విమర్శించారు. తెలంగాణకు నష్టం జరగకముందే బనకచర్లను ఆపేలా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చర్యలు తీసుకోవాలని సూచించారు. బనకచర్లపై రైతులతో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం అని హరీష్ రావు పేర్కొన్నారు.
బనకచర్ల పై తెలంగాణ వాదన గట్టిగా విన్పించాలి: హరీష్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -