Saturday, June 28, 2025

అర్జున్ విషయంలో సచిన్ నాతో అలా అన్నారు: పృథ్వీ షా

- Advertisement -
- Advertisement -

యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) తన కెరీర్ ఆరంభంలో అద్భుతంగా రాణించాడు. అంతా అతను స్టార్ క్రికెటర్ అవుతాడని భావించారు. కానీ, క్రమశిక్షణ రాహిత్యం, ఫిట్‌నెస్ తదితర కారణాల వల్ల అతను జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం దేశవాలీ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే తాజాగా టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో తనకు ఎదురైన అనుభవం గురించి షా వెల్లడించాడు. పృథ్వీ షా, సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇద్దరు మంచి స్నేహితులు. పృథ్వీ షా కెప్టెన్సీలో అర్జున్ అండర్-13, అండర్-14 క్రికెట్ ఆడాడు. దేశీ క్రికెట్‌లో 2022లో అర్జున్ గోవాకు మారే వరకూ ఇద్దరు కలిసి ఆడారు.

అయితే తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు అర్జున్‌ విషయంలో ఎలా స్పందించాలో తను అర్థం కాకపోయేదని పృథ్వీ (Prithvi Shaw) ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కి ఇచ్చి ఇంటర్వ్యూలో తెలిపాడు. ఎంఐజి కబ్ల్ టీమ్‌కు ఆడే సమయంలో తాను కెప్టెన్‌గా ఫీల్డ్ సెట్ చేసేవాడినని.. మ్యాచ్ సమయంలో అర్జున్ క్యాచ్ వదిలేసినా.. ఇంకేదైనా తప్పు చేసినా.. అతనిలో ఎలా రియాక్ట్ అవ్వాలో తనకు తెలిసేది కాదని పృథ్దీ అన్నాడు. ఎందుకంటే అర్జున్ పృథ్వీకి మంచి స్నేహితుడు మాత్రమే కాదు.. సచిన్ కుమారుడు కూడా కావడం అతని తికమక పెట్టేదని పేర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో సచిన్ ఒకసారి ‘ఆట విషయంలో ఇలాంటి సందేహాలు వద్దు, నువ్వేదైనా అతనికి చెప్పాలనుకుంటే నిర్మొహమాటంగా చెప్పేయ్’ అని అన్నారని పృథ్వీ తెలిపాడు. అర్జున్ క్రికెట్ విషయంలో సచిన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News