Wednesday, August 13, 2025

కర్ణాటకలో ఐదు పులులు మృతి

- Advertisement -
- Advertisement -

కర్ణాటక చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మహదేశ్వర కొండ ప్రాంతంలోని అడవుల్లో ఐదు పులులు మృతి చెందాయి. మృతి చెందిన వాటిలో తల్లి పులి, దాని నాలుగు కూనలు ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు విషం పెట్టడం వల్లే అవి చనిపోయి ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు. హుగ్యం అడవుల్లో కుళ్లిపోయిన ఆవు మృత కళేబరం లభించడం కూడా ఈ అనుమానానికి బలం చేకూరుస్తున్నది. ఈ ఘటనపై మూడు రోజుల్లో దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే తెలిపారు. విషయాన్ని తమ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందని కూడా ఆయన అన్నారు. ఈ ఘటన తర్వాత అటవీశాఖ యాంటీపోచింగ్ విజిలెన్స్‌ను పెంచింది. పులులు అధికంగా ఉన్న రెండో రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ 563 పులులు ఉన్నాయి. కాగా మధ్యప్రదేశ్ 785 పులులతో మొదటిస్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News