Saturday, June 28, 2025

బెదిరించి బాండ్లు కొనిపించారు

- Advertisement -
- Advertisement -

నా భూమిని కొన్న వ్యక్తికి
బెదిరింపు ఫోన్‌ట్యాపింగ్
కేసులో బిఆర్‌ఎస్‌పై ఎంపి
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
సంచలన ఆరోపణ
వారెంట్ లేకుండా తన
కార్యాలయాన్ని తనిఖీ
చేశారని ఫిర్యాదు

మన తెలంగాణ/హైదరాబాద్ : నా నుంచి భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ఫోన్ ట్యాప్ చేసి అతన్ని బెదిరించి రూ. 13 కోట్ల విలువ చేసే తమ పార్టీ ఎలక్టోరల్ బాండ్లను గత ప్రభుత్వం కొనిపించిందని చె వెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కే సులో సిట్ ముందు విశ్వేశ్వర్‌రెడ్డి శుక్రవారం హాజరై తన వాంగ్మూ లం వినిపించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ గ త బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన కు టుంబ సభ్యులు, సన్నిహితులుల ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు చెప్పినట్టు తెలిపారు. తాను బిఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక తన ఫోన్ ట్యాపింగ్ చేశారని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులు లేకుండా తన పాలనను కొనసాగాలని కెసిఆర్ భావించి ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మునుగోడు, హుజురాబాద్, దుబ్బాక ఎన్నికలలో తన ఫోన్ ట్యాప్ చేసి ఆ సమాచారంతో ఇబ్బందులకు గురిచేశారన్నారు. తన స్నేహితుడు రూ. 72 కోట్లతో బంగారం కొనుగోలు చేస్తే అవి తన డబ్బులు అంటూ పోలీసులు ఇబ్బంది పెట్టారన్నారు.

వారంట్ లేకుండా తనిఖీ చేయడానికి తన కార్యాలయానికి వచ్చారని ఫిర్యాదు చేస్తే తిరిగి నాపైనే నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని విశ్వేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ దౌర్జన్యానికి రెండు వారాల పాటు బెంగుళూరులో తలదాచు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అలాగే తన భార్య సంగీత రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి ఆమెను కూడా మానసిక ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సిట్ అధికారులు తీవ్రం జాప్యం చేస్తున్నారని, ఈ కేసులో భాగస్వామ్యమయిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని, ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్థావిస్తానని ఆయన చెప్పారు. కెసిఆర్, కెటిఆర్‌కు శిక్ష పడితే మళ్లి ఇలాంటి చర్యలు ఎవరూ చేపట్టకుండా ఉంటారని ఆయన పేర్కొన్నారు. కాగా, మెదక్ ఎంపి రఘునందన్ రావు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేసారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా సిట్ అధికారులు అక్కడికి వెళ్లి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.అలాగే ఒక తెలుగు పత్రికాధిపతి వాంగ్మూలాన్ని కూడా సిట్ అధికారులు నమోదు చేసారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News