మల్టీ టాలెంటెడ్ సూపర్స్టార్ ఎస్జె సూర్య పది ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం టైటిల్ ‘కిల్లర్’. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ గోకులం మూవీస్ (గోకులం గోపాలన్ నేతృత్వంలో), ఎస్జె సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళ, కన్నడ తదితర భాషలలో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గోకులం మూవీస్, ఈ సినిమాతో తమిళ సినీ రంగంలో కమ్ బ్యాక్ ఇస్తోంది.
ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ శుక్రవారం గ్రాండ్ గా జరిగింది. హీరో కార్తి ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్కు హాజరై సినిమా టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. వాలి, ఖుషీ, న్యూ వంటి క్లాసిక్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్జె సూర్య, ఈ సినిమాకు స్టార్ స్టడెడ్ తారాగణాన్ని తీసుకొస్తున్నారు. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదు భాషలలో విడుదల కానుంది. ఇది ట్రూ పాన్ ఇండియా అనుభూతిని ఇవ్వనుంది.