Saturday, June 28, 2025

న్యాయ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతాలోని లా కాలేజీ ఆవరణలోనే ఘాతుకం
దారుణ ఘటనను వీడియోగా చిత్రీకరించిన నిందితులు
అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురిలో ఒకరు తృణమూల్
కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేత మిగిలిన ఇద్దరు
ప్రస్తుత విద్యార్థులు ఆర్‌జికర్ ఘటన తరహాలోనే
అమానుషం అక్కడ డాక్టర్…ఇక్కడ కాబోయే లాయర్
బాధితులు బిజెపి, టిఎంసి మధ్య రగిలిన రాజకీయ చిచ్చు

కోల్‌కతా : ఆర్‌జి కర్ ఆస్పత్రి ఘటన మరిచిపోకముందే పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం జరిగింది. దక్షిణ కోల్‌కతాలోని న్యాయ కళాశాల ఆవరణలో 24 సంవత్సరాల విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.దుండగుల్లో ఇద్దరు సీనియర్ విద్యార్థులు కాగా, మరొకడు ఇక్కడ కాలేజీలో పనిచేసే ఉద్యోగి. ఇతడు అధికార పార్టీ టిఎంసి విద్యార్థి విభాగం నేత అని వెల్లడైంది. నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం కస్టడీకి అప్పగించింది. ఈ నేరంలో ఓ వ్యక్తిని ప్రధాన నిందితుడుగా గుర్తించారని పోలీసు వర్గాలు శుక్రవారం తెలిపాయి.

పెళ్లికి నిరాకరించినందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా తెలిసింది. అరెస్టు అయిన వారిలో ఒకడైన మనోజిత్ మిశ్రా టిఎంసి నేతగా చెబుతున్నారు. ఈ నెల 25 రాత్రి 7 నుంచి 7.30 గంటల మధ్యంలో దుండగులు కాలేజీలోని గార్డు రూంలోనే అకృత్యానికి పాల్పడ్డారని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. అత్యాచార ఘటనను నిందితులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఆరు నెలల క్రితం స్థానిక ఆర్‌జి కర్ వైద్య కళాశాలో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇది దేశవ్యాప్త సంచలనానికి దారితీసిన సంఘటన తెలిసిందే.

అసలేం జరిగింది?
న్యాయ విద్య అభ్యసిస్తున్న బాధితురాలు బుధవారం మధ్యాహ్నం కస్బాలోని తన కాలేజీకి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది. పరీక్షల సంబంధిత ఫారమ్ దాఖలు చేయడానికి సిద్ధం అయింది. ముందుగా కాలేజీ యూనియన్ రూంలో కూర్చుంది. మధ్యాహ్నం వరకూ కాలేజీలోనే ఉండాలని కాలేజీలో పనిచేస్తున్న ప్రధాన నిందితుడు యువతికి చెప్పాడు. ఈ లోగా ప్రధాన నిందితుడు ప్రధాన ద్వారం మూసివేయించాడు. తరువాత ఆమెను అక్కడి సెక్యూరిటీ గార్డు గదికి తీసుకువెళ్లి అఘాయిత్యం జరిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా కాగా మిగిలిన ఇద్దరు జయిబ్ అహ్మద్ (19), ప్రమీత్ ముఖర్జీ (20) అని పోలీసు కథనం ప్రకారం వెల్లడైంది. దుండగులు అత్యంత పైశాచికంగా యువతిపై రెండు గంటల పాటు దారుణ రీతిలో చేష్టలకు దిగారు. యువతి స్థానిక కస్బా పోలీసు స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసింది.

కాళ్ల మీద పడ్డా కనికరించలేదు: బాధితురాలు
దాదాపు నాలుగు గంటల పాటు కిరాతకులు తనకు నరకం చూపారని బాధితురాలు వాపోయింది. ప్రధాన నిందితుడి కాళ్లు పట్టుకున్నా వినలేదని, పైగా ఏం ఫర్వాలేదు పెళ్లి చేసుకుంటానని వెటకారానికి దిగాడని తెలిపింది. తనకు స్నేహితుడితో పెళ్లి నిశ్చయం అయిందని, తనను వదిలిపెట్టాలని ప్రాధేయపడినా తరువాత ప్రధాన నిందితుడు మరింత రెచ్చిపోయాడని, తనకు చివరికి ఓ దశలో శ్వాస తీసుకోవడం కూడా కష్టం అయిందని ఫిర్యాదులో వాపోయింది. ఇన్‌హేలర్ కావాలని కోరితే కాసేపటి తర్వాత నిందితుల్లో ఒకడు తెచ్చి ఇచ్చాడని వివరించింది. సాయంత్రం నాలుగు తరువాత తాను బయటపడ్డానని తెలియచేసింది.

రాష్ట్రంలో రాజకీయ దుమారం
ఇప్పుడు జరిగిన దారుణ ఘటనతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. ఇది సిగ్గుచేటు ఘటన అన్నారు. ప్రతి విద్యాసంస్థల్లోకి పోలీసులను పంపించి, అందరినీ రక్షించలేం కదా అని వ్యాఖ్యానించారు. కాగా ప్రధాన నిందితుడు టిఎంసి ఎంపి , మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో కలిసి ఉన్న పలు ఫోటోలను బిజెపి విడుదల చేసింది. మేనల్లుడి సన్నిహితుడు నేరానికి పాల్పడితే ఇక సిఎం ఈ లా విద్యార్థినికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. కాలేజీలో జరిగిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. దుండగులపై కఠిన చర్యలకు డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News