- Advertisement -
తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ జవహర్ నగర్ లో తాను నివసిస్తున్న ఇంటిలోనే శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవిలతో కలిసి కొన్నిరోజుల క్రితం వరకు రాంనగర్ వైఎస్సార్ పార్క్ సమీపంలోని ఒక ఇంట్లో ఉన్న స్వేచ్ఛ ఇటీవలే జవహర్ నగర్ లోని ఇంటికి మారింది. చిక్కడపల్లి ఏసిపి రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ ఘటనా స్థలాన్ని సందర్శించి స్వేచ్ఛ ఆత్మహత్యకు దారితీసిన కారణాలను అన్వేషిస్తున్నారు.
- Advertisement -