Saturday, June 28, 2025

కొత్త పంట రుణాలు ఇచ్చుటకు అలాట్మెంట్ ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ రైతు సేవా సహకార సంఘంలో ఖరీఫ్ సీజన్ లో కొత్త పంట రుణాలు ఇచ్చుటకు డిసిసిబి అలాట్మెంట్ ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేశారు. శుక్రవారం మోత్కూర్ రైతు సేవా సహకార సంఘం 29వ కార్యవర్గ సమావేశం సంఘం అధ్యక్షులు పేలపూడి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎల్టి లోన్స్ ఒటి ఎస్ కల్పించుటకు, సహకార సంఘానికి ఇవ్వాల్సిన డివిడెంట్, వరి ధాన్యము కొనుగోలుపై సంఘానికి రావాల్సిన కమిషన్ ఇచ్చుట గురించి జిల్లా బ్యాంక్ అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ రెడ్డి కోరుతూ తీర్మానాలు చేసినట్లు సంఘం అధ్యక్షులు తెలిపారు. సంఘంలో సభ్యులు తీసుకున్న పంట రుణాలు వడ్డీ చెల్లించి తమ రుణాలు రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరారు. ఎల్ టి లోన్స్ వాయిదా మీరిన వారికి తమ అప్పులను సంఘమునకు చెల్లించడానికి ఓ టి ఎస్ కల్పించుతూ తీర్మానం చేసినట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో సంఘ డైరెక్టర్లు గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి, పురుగుల మల్లయ్య కారుపోతుల ముత్తయ్య, సామ పద్మా రెడ్డి, తాళ్లపల్లి స్వామి, బండ పద్మ, బుషిపాక సుజాత, జిట్టా లక్ష్మయ్య,సంఘ కార్యదర్శి కే వరలక్ష్మి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News