ఛండీగఢ్: కోడలిపై మామ హత్యాచారం చేసి అనంతరం ఇంటి ముందే గుంత తీసి మృతదేహాన్ని పాతిపెట్టాడు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యుపిలోని షికోహాబాద్కు చెందిన తను అనే యువతి, హర్యానాలో ఫరీదాబాద్కు చెందిన అరుణ్ అనే యువకుడి రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుంది. వివాహం జరిగినప్పటి నుంచి కోడలిని అదనపు కట్నం తీసుకరావాలని పలుమార్లు వేధించారు. దీంతో తన పుట్టింటి వారి సమక్షంలో పంచాయతీ పెట్టడంతో దంపతులకు పెద్ద మనషులు నచ్చచెప్పి కాపురం చేయాలని సూచించారు.
కోడలు ఇంటి నుంచి పారిపోయిందని ఆమె పుట్టింటి వారికి అత్తింటి వారు సమాచారం ఇచ్చారు. ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్తింటి వారిపై అనుమానాలు ఉన్నాయని చెప్పడంతో పోలీసులు గ్రామస్థుల సహకారంతో విచారణ చేశారు. ఇంటి ముందు పది అడుగుల గొయ్యి తవ్వినట్టు పోలీసులు సమాచారం వచ్చింది. దీంతో గొయ్యిని పోలీసులు మళ్లీ తవ్వి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఆమె మృతదేహం కనిపించింది. వెంటనే మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అత్తింటి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించారు. మత్తు మందు కలిపిన పానీయాన్ని కోడలికి తాగించిన అనంతరం ఆమెపై మామ అత్యాచారం చేశాడు. ఆమెన చంపేసి గొయ్యిలో పూడ్చి పెట్టినట్టు నిజాలు ఒప్పుకున్నారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.