అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో పట్టపగలే చోరీ జరిగింది. కారు అద్దాలు పగులకొట్టి ఏడు లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహోబిలం గ్రామానికి చెందిన అనగొండ నరసింహ ఎస్ బిఐ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ. 7లక్షల లోన్ తీసుకున్నాడు. ఆలయ వేలం పాటల్లో పాల్గొనేందుకు అవసరానికి బ్యాంకు లోన్ తీసుకున్నాడు.
నగదును కారులో ఉంచుకుని తన పిల్లలు చదువుకుంటున్న విశ్వశాంతి విద్యానికేతన్ స్కూల్ లోకి తీసుకురావడని నరసింహ వెళ్లాడు. పిల్లలతో ఆయన బయటకు వచ్చేలోగానే కారు అద్దాలు ధ్వంసం చేసి రూ. 7 లక్షలు దుండగులు దొంగలించారు. బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిసి టివి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.