- Advertisement -
అమరావతి: బక్కన్న పాలెం జివిఎంసి పరిధిలో తాగునీరును నిలిపివేశారు. జివిఎమ్ సి చరిత్రలో మంచినీటి సరఫరా ఆగిపోవడం ఇదే తొలిసారి అని పలు కాలనీల ప్రజలు అన్నారు. 3 లక్షల ఇంటి కుళాయిలకు మంచినీటి సరఫరా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బక్కన్న పాలెంలో (Bakkanna Palace) ఖాళీ బిందెలతో మహిళలు ధర్నాచేశారు. తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని మహిళలు చెప్పారు. మరోసారి మేయర్ తో చర్చలకు వాటర్ సప్లై ఉద్యోగులు వెళ్లనున్నారని తెలిపారు. చర్చలు సఫలం అయితేనే.. వాటర్ సప్లై ఉద్యోగులు నీటిని విడుదల చేస్తామంటున్నారని మహిళలు స్పష్టం చేశారు.
- Advertisement -