Thursday, August 14, 2025

జీడిమెట్లలో వేగంగా వెళ్లి ఆర్ టిసి బస్సును ఢీకొట్టిన బైక్

- Advertisement -
- Advertisement -

జీడిమెట్ల: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న ఆర్టిసి బస్సును అతివేగంతో బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు యువకుల తలకు బలమైన గాయాలయ్యానని వైద్యులు వెల్లడించారు. బైక్ అతివేగంతో నడపడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News