- Advertisement -
హైదరాబాద్: అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడం హాస్యాస్పదం, సిగ్గుచేటు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఎక్స్ వేదికగా సిఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రూ.5 భోజనం ‘అన్నపూర్ణ’ పథకం పేరు మార్చడంపై మండిపడ్డారు. ఢిల్లీ బాసులకు విధేయత (Loyalty Delhi bosses) కోసం వాళ్ల పేరును మార్చుకోవచ్చు కదా? అని ఎద్దేవా చేశారు. వాళ్ల పేరును రాజీవ్ లేదా జవహర్ గా ఎందుకు మార్చుకోకూడదు? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ అర్థరహిత చర్యలన్నింటినీ రద్దు చేస్తాం అని కెటిఆర్ పేర్కొన్నారు.
- Advertisement -