- Advertisement -
నిజామాబాద్ పసుపు బోర్డును ఇంకెన్నీ సార్లు ప్రారంభిస్తారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. రేపు(ఆదివారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా నిజామాబాద్ లో పసుపుబోర్డును ఆయన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో శనివారం కవిత మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి నాయకులపై ఫైరయ్యారు. ఇప్పటికే రెండుసార్లు పసుపుబోర్డును ప్రారంభించారని.. మూడోసారి ప్రారంభించేందుకు అమిత్ షా వస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్.. ఈ విషయం చెప్పకుండా అమిత్ షాను ఇక్కడికి తీసుకువస్తున్నారేమోనని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని పసుపు రైతుల పట్ల చిత్తశుద్ది ఉంటే.. వెంటనే పసుపుబోర్డుకు చట్టబద్దత కల్పించాలని కవిత అన్నారు.
- Advertisement -