రాబోయే 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు ఆటంకాలను
అధిగమించి కంచగచ్చిబౌలి భూములను అభివృద్ధి చేస్తాం సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు
చేసి మరో 5లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం త్వరలో తెలంగాణ రైజింగ్2047
ప్రణాళిక నగరాన్ని కాలుష్యరహితం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు ముంపు నివారణకే
చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నాం హైదరాబాద్పై ఒత్తిడి తగ్గించడానికే
ఫ్యూచర్ సిటీని తెస్తున్నాం తెలంగాణకు బిజెపి ఏం ఇచ్చిందో కిషన్రెడ్డి చెప్పాలి
పేదలపెన్నిధి పిజెఆర్ ఆయన ఇల్లు నిత్యం జనతా గ్యారేజీలా ఉండేది పిజెఆర్
ప్లైఓవర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
మన తెలంగాణ/సిటీ బ్యూరో : ఎంత మంది రాక్షసులు అ డ్డొచ్చినా.. హైదరాబాద్ మహానగర అభివృద్ది ఆగదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణ రైజిం గ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం., కోర్ అర్బన్ రీజియన్, సేమీ అర్బన్ రీజియన్, రూరల్ తెలంగాణగా వి భజించి అభివృద్దిలో ముందుకు అడుగులు వేస్తున్నామని సిఎం వెల్లడించారు. దివంగత ఎమ్మెల్యే పి. జనార్ధన్రెడ్డి (పీజేఆర్) ఫ్లైఓవర్ను సీఎం రేవంత్రెడ్డి శనివారం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్ నుండి -గచ్చిబౌలి మార్గంలో 6 లైన్లతో 1.2 కి.మీ.లుగా రూ.182.72 కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు ఫ్లైఓవర్ ను జీహెచ్ఎంసి నిర్మాణం చేపట్టింది. పీజేఆర్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్రెడ్డి మాట్లాడు తూ.. కంచ గచ్చిబౌలిలో భూముల్లో ఐటీ కంపెనీలు తీసుకువచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నారు.
కంచగచ్చిబౌలి భూములపైన న్యాయపోరాటంచేసి భూములను సాధించుకుని లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మేం ఆగం. అని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. 2028 లో రాజకీయాల పై ఆలోచిద్దాం.. అప్పటి వరకు అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధికి పనిచేయాలని కోరుతున్నానని అన్నారు. కొంతమంది నగర అభివృద్ధిని అడ్డుకోవడానికి రాజకీయాలు చే స్తున్నారు. విదేశీ పర్యటనలు చేసి పెట్టుబడులు తెస్తే.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.. కోర్టుల్లో కొట్లాడి అక్కడే నా లెడ్జ్ పార్క్ను తీసుకొస్తాం.. అని ముఖ్యమంత్రి వెల్లడించా రు. రాబోయే 100 యేళ్లకు సరిపోయేలా నగరాభివృద్ధి కో సం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని సిఎం చెప్పారు.
రోడ్ల వెడల్పు, అండర్ పాస్లు,
ప్లై ఓవర్లు నిర్మించబోతున్నామని తెలిపారు. వచ్చే 100 రోజుల్లో కోర్ అర్బన్ ప్లాన్ సిద్దమవుతుందనీ, డిసెంబర్ 9 లోపల కోర్ అర్బన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం.. ప్రపంచం అంతా భారత్ ఫ్యూచర్ సిటీ వైపు చూస్తోంది. అని రేవంత్రెడ్డి వివరించారు. తెలంగాణలో 65 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తుందనీ, హైదరాబాద్కు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబైలు పోటీకాదు. న్యూయర్క్, టోక్యో, సింగపూర్లతో పోటీ పడాలి. ఢిల్లీ నగరం కాలుష్యం కారణంగా నివసించలేని పరిస్థితిలో ఉంది. చెన్నైలో వరద కష్టాలు, బెంగుళూరులో ట్రాఫిక్ కష్టాలు ఉన్నాయి. ముంబై, చెన్నై, బెంగళూరు నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. రాజకీయాల ముసుగులో ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే వారిని క్షమించ వద్దు. అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కేంద్ర సహకరించడంలేదు..
రాజీవ్ గాంధీ టెక్ పార్క్ ను హైదరాబాద్ కు తెచ్చిన ఘనత పీజేఆర్ది.. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.. హై టెక్ సిటీగా మార్చారు.. ఇంత గొప్ప నగరాన్ని అభివృద్ధి పరచడానికి సోనియా గాంధీ ఆశ్చర్యంలో ఇప్పుడు మేము మీ ముందుకు వచ్చామని సిఎం రేవంత్రెడ్డి చెప్పారు. కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని కిషన్రెడ్డిని కోరుతున్నాను. డిల్లీలో కిషన్రెడ్డి ఇంటికి వెళ్లి కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరాను. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కేంద్రాన్ని కోరడానికి ఎన్నో సార్లు డిల్లీ కి వెళ్ళాను.. వెళ్లినప్పుడల్లా..
ప్రతి మంత్రినీ కలిసి ప్రాధేయ పడ్డానని రేవంత్రెడ్డి చెప్పారు. రేపు కూడా హైదరాబాద్కు అమిత్షా వస్తున్నారు. స్వయంగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో ఎయిర్ పోర్టుకు వెళ్ళి మళ్ళీ హైదరాబద్ అభివృద్ధికి సహకరించాలని కోరుతాం. అని సిఎం అన్నారు. మన్మోహన్ సింగ్, జైపాల్ రెడ్డిల వల్ల హైదరాబాద్కు మెట్రో వచ్చింది. పీవీ నరసింహారావు వల్ల ఐటీ వచ్చింది. ప్రధాని మోదీ వల్ల హైదరాబాద్కు ఇప్పటివరకు ఏంవచ్చిందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలి. బెంగళూరు, చెన్నై, ఏపీకి మెట్రో రైల్ ఇచ్చారు.. గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు. గుజరాత్కు సబర్మతి, ఢిల్లీకి యమునా, ఉత్తర ప్రదేశ్కు గంగా ఇచ్చారు. మరీ మన మూసీ రివర్ ఫ్రంట్కు ఎందుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు..? అని సిఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
పీజెఆర్ శకం..
20 నుండి 25 ఏళ్లు హైదరాబాద్ నగరంలో పీజేఆర్ శకం నడిచిందని, ఇతర ప్రాంతాల నుండి బ్రతుకు తెరువుకు నగరానికి వచ్చిన వారిపై ఎవరైనా దౌర్జన్యం చేసినా పీజేఆర్ అడ్డుకునేవారని ముఖ్యమంత్రి గుర్తుచేవారు. పీజేఆర్ ఇల్లు ప్రజల సమస్యలు తీర్చేందుకు జనతా గ్యారేజిలా ఉండేది.. ప్రభుత్వం మీద పీజేఆర్ చేసిన పోరాటంతోనే నగరానికి కృష్ణా నీటిని రావడానికి కారణం. నగరానికి త్రాగునీటి అందించిన ఘనత పీజేఆర్ది. అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. హైటెక్ సిటీ మహారాష్ట్రకు తరలి పోకుండా పీజేఆర్ పోరాటం చేశారన్నారు. ఫినాన్సియల్ డిస్ట్రిక్లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నాం. పీజేఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి సరైన ప్రదేశం చూడమని అధికారులకు ఆదేశిస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు.
నగరం గొప్పగా ఎదగాలి..
రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు చేయాలని సిఎం సూచించారు. దిల్లీలో పొల్యూషన్ పెరిగి అక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వచ్చింది. వరదలు వచ్చినప్పుడు చెన్నై, ముంబై పరిస్థితి చూశాం. మరి ప్రజలు ఆలోచించి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా తెచ్చుకుందామా..? అని సిఎం ప్రశ్నించారు. ఆర్టీసిలోని డీజిల్ బస్సులకు బదులుగా ఎలెక్ట్రిక్ బస్సులు తెస్తున్నాం. ఆటోవాళ్ళు కూడా డీజిల్ ఆటోలకు బదులు ఎలెక్ట్రిక్ అటు కొనుకోవాలని కోరుతున్నాను..ఈవి వాహనాలు కొనుక్కునే వారికి టాక్స్ లేకుండా అవకాశం ఇస్తున్నామని సిఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. ఓలా, ఉబర్ లాంటి వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇస్తున్నాం..
నాగార్జునకు చెందిన ఎన్ కన్వేషన్ చెరువును ఆక్రమించి నిర్మిస్తే ప్రభుత్వం కూల్చివేయగా.. రియలైజ్ అయిన నాగార్జున రెండెకరాల భూమిని స్వయంగా అప్పజెప్పి రియల్ హీరో అయ్యారని సిఎం తెలిపారు. డీజిల్ బస్సు ల వల్ల హైదరాబాద్ లో కాలుష్యం పెరుగుతుందని వాటిని జిల్లాలకు తరలించామన్నారు. నగరంలోకి 3వేల ఎలక్ట్రిక్ బస్సులసు తీసుకొస్తున్నాం. ఆటోల కొనుగోలుపైన నిషేధాన్ని తొలగించి ఎలక్ట్రికల్, సీఎన్జీ ఆటోలకు అనుమతినిస్తున్నాం. ఈవీ వెహికల్స్కు పూర్తి స్థాయిలో పన్ను మినహాయింపు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైడ్రాతో నగరంలో ఆక్రమణలు తొలగిస్తున్నాం. 2029లో శేరిలింగంపల్లి 4 అసెంబ్లీ నియోజకవర్గాలు విడిపోయే అవకాశం ఉందన్నారు.