Sunday, June 29, 2025

పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లొద్దు

- Advertisement -
- Advertisement -

ఫ్యూచర్‌సిటీ భూసేకరణ త్వరితగతిన పూర్తి
చేయాలి డేటా సెంటర్ల కోసం స్థలాలు
సిద్ధం చేయాలి మరిన్ని గ్లోబల్ కేపబులిటీ
సెంటర్లు రావాలి 100రోజుల ప్రణాళిక
సిద్ధం చేయాలి సమీక్షా సమావేశంలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ భూ సేకరణను తొందరగా పూర్తి చేయాలని, డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖకు సంబంధించి జూబ్లీహిల్స్ నివాసంలో సిఎం రేవంత్‌రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఇండ్రస్టీస్ నిఖిల్ చక్రవర్తి, టిజిఐసిసి వైస్ చైర్మన్ శశాంక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ డేటా సెంటర్ల కోసం కావాల్సిన స్థలం సిద్ధం చేయాలని, పెట్టుబడుల కోసం రాష్టానికి వచ్చే పారిశ్రామిక వేత్తలు ఎవరూ వెనక్కి వెళ్లడానికి వీలు లేదని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నిమ్జ్‌లో మిగిలి ఉన్న భూ సేకరణను తక్షణమే పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు.

రైతులతో మాట్లాడి భూములు’ ఇవ్వడానికి ఒప్పించాలని సిఎం సూచించారు. ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్ ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్ కాంప్లెక్స్ కోసం అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్ ఆర్కిటెక్చర్స్‌ను నియమించుకోవాలని సిఎం రేవంత్ పేర్కొన్నారు. స్పోర్ట్ కాంప్లెక్స్ లో క్రికెట్, ఫుట్‌బాల్, గోల్ప్ వంటి అన్ని క్రీడలు ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని, మెగా ప్రాజెక్టులపైనా మంత్రి వర్గ ఉపసంఘం ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించి ప్రతిపాదిత ప్రాజెక్టులపై చర్చిస్తుందని సిఎం అన్నారు. 2024 లో గ్లోబల్ కెపబులిటీ సెంటర్స్ వచ్చాయని, 2025లో ఇప్పటికే 25 గ్లోబల్ కెపబులిటీ సెంటర్స్ వచ్చాయని, మరిన్ని సెంటర్స్ వచ్చేలా కృషి చేయాలని, 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకొని అధికారులు పని చేయాలని సిఎం రేవంత్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News