Sunday, June 29, 2025

టెస్టుల్లో వరుస ఓటములు.. ఒత్తిడిలో గౌతం గంభీర్!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ క్రీడా విభాగం: టెస్టుల్లో ఎదురవుతున్న వరుస ఓటములతో టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ తీవ్ర ఒత్తిడిలో కూరుకు పోయాడు. అతను కోచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ ఆడిన 9 టెస్టుల్లో ఏకంగా ఏడింటిలో పరాజయం పాలైంది. న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్‌కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌లనూ భారత్‌కు ఘోర పరాజయం ఎదురైంది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో కూడా జట్టుకు ఓటమి తప్పలేదు. ఇలాంటి స్థితి లో ప్రధాన కోచ్ గంభీర్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొం ది. వరుస ఓటముల నేపథ్యంలో అతన్ని ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్ జో రందుకుంది. గంగూలీ, సెహ్వాగ్ వంటి మాజీ క్రికెటర్లు తాము కోచ్ పదవి కోసం సిద్ధమని చే స్తున్న ప్రకటనలు గంభీర్‌ను మరింత ఆత్మరక్షణలో పడేస్తున్నాయి.

ఇంగ్లండ్‌తో జరిగే మిగతా నాలుగు టెస్టుల్లో జట్టును ఎలాగైన గెలిపించాల్సిన బాధ్యత గంభీర్‌పై నెలకొంది. ఆటగాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపి వారు మైదానంలో మెరుగైన ప్రదర్శన చేసేలా ఒప్పించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహి త్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌లు లేని లోటు జట్టుపై బాగానే కనిపించింది. మిగిలిన మ్యాచు ల్లో భారత్‌కు మరిన్ని ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో టీమిండియా విజయం సాధించడం అనుకున్నంత తేలికేం కాదని చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమష్టిగా ముందుకు సాగాల్సి ఉంటుం ది. ఆటగాళ్లలో కొత్త జోష్‌ను నింపాల్సిన బాధ్య త ప్రధాన కోచ్‌పైనే ఉంటుంది. వరుస ఓటముల నేపథ్యంలో టీమిండియా ప్రస్తుతం ఆత్మరక్షణలో పడింది. ఈ పరిస్థితుల్లో జట్టును గెలుపు పథంలో నడిపించడం కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు సవాల్‌గా తయారైంది. ఆటగాళ్లలోని ప్రతిభను వెలికి తీసి వారిని మెరుగైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రధాన కోచ్ గంభీర్‌పైనే ఉంటుంది. ఇందులో అతను ఎంత వరకు సఫ లం అవుతాడనే దానిపైనే గంభీర్ కోచ్ పదవి భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News