నేషనల్ క్రష్ రష్మిక మందన్న మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్ చిత్రాలు. రణబీర్ కపూర్ సరసన యానిమల్, అల్లు అర్జున్ తో పుష్ప చిత్రాలు, విక్కీ కౌశల్ తో చావా వంటివి చేసి పెద్ద హీరోయిన్గా స్థానాన్ని స్థిరపరచుకొంది. తాజాగా బ్లాక్బస్టర్ కుబేర సినిమాలో కనిపించింది. ఇవన్నీ రెగ్యులర్ పెద్ద హీరోయిన్లు చేసే మసాలా చిత్రాలే. కానీ ఇప్పుడు ఆమె పెద్ద సినిమాలతో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలవైపు వెళ్తోంది.
ఇప్పటికే ఆమె రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గాళ్ ఫ్రెండ్ చిత్రంలో నటించింది. ఇది కూడా పూర్తిగా రష్మిక చుట్టూ తిరిగే చిత్రం. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. త్వరలోనే విడుదల కానుంది. ఆ సినిమా విడుదల కాకముందే ఇప్పుడు మైసా అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఒప్పుకొంది. ఇందులో గోండ్ మహిళగా కనిపించనుంది. అంటే గిరిజన యువతి పాత్ర. ఇది పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ.